మా అయ్యగారు శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారు కవి..పండితుడు..<విమర్శకుడు..గ్రంధకర్త..సంగీత సాహిత్య నాట్యశాస్త్రాల పారమెరిగినవారు..అంతేకాదు..గొప్పవాగ్గేయకారులు..అధ్భుతమైన కృతికర్త..నిజమైన భక్తిని అనుభవించి..ఆ అనుభవసారాన్నిమంచి మంచి కీర్తనలరూపంలోమనకూ అందజేసిన పరమ భక్తుడువారి కృతులుకడప హైదరాబాదు విజయవాడ విశాఖ పట్నంఆకాశవాణి కేంద్రాలలోగత నాలుగు దశాబ్దాలుగా అలరించాయి..ఆనాళ్ళలో..మంచి సాహిత్యంమంచి సంగీతంమంచి శ్రోతలుమంచి కాలంఅలా అన్నీ అమిరాయిఅమృతాన్ని పంచేఆప్రాభవాన్ని మళ్ళీ అక్షరరూపం లోఅందరికీ అందించాలనీఅనుభూతితో పాడే కంఠాల్లోవాని జీవత్వాన్ని మీరూ అనుభవించాలనీఓ చిన్ని ప్రయత్నం..అదే..సరస్వతీపుత్రుని అష్టాక్షరీ పద వైభవం గామీ ముందుకు తెస్తున్నాను..ఇందులోమా అమ్మా అయ్యా ఇద్దరూ వ్రాసినా..అమ్మ అయ్య వెనుకే వుండటానికి ప్రాధాన్యమిచ్చారు.కనుక ఆ తల్లిఆ సరస్వతీపుత్రునిలో సగ భాగంఎన్నడూ విడదీయలేనిదైంది..-పుట్టపర్తి అనూరాధ.
ఈ అష్టా క్షరీ కృతులు సుమారేడువేల వరకున్నవి ఇవి వ్రాసినప్పటి నా మానసిక స్థితి ..అది ఒక గొప్ప అనుభూతి ..వీని రచన 1948-1951 సంతవ్సరముల మధ్య సాగినదని చెప్పవచ్చు ఇవి యెన్నడైనను వెలుగు జూచు నను భావము నాకానాడు లేదు ఆ దృష్టితో వానిని వ్రాయలేదు గూడ వీని రచన నా దృష్టిలో ఒక సాధనా విశేషముగ నడచినది ఈ నాటికొక రెండు నూర్లు కృతులు బయటికి వచ్చినవి తక్కిన వేమగునో తెలియదు ఇవి వెలుగు జూచు విషయములో చాల భాగము పరిశ్రమ మా చిరంజీవి కొండప్ప దన వచ్చును వాడీ కృతులను చాల చోటులలో పాఠము చెప్పి ప్రచారము చేసెను నేటికిని చేయుచునాడు వానికి భగవంతుడు ఆయురారోగ్యములను బ్రసాదించుగాక ముఖ్యముగ యీ ప్రయత్నమునకు దాతలు శ్రీ వల్లంకొండు ఆంజనేయులు గూడూరు శ్రీరాములు శెట్టిగారలు వారిని శ్రీనివాసుడు సంతతము చల్లని చూపుతో చూచుగాక ఈ ప్రయత్నమునకు దోడ్పడిన మరి కొందరున్నారు వారు తమ నామ ధేయమును ప్రకటించుటకంగీకరింపలేదు. నా శిష్యులును కొందరున్నారు.
ఇట్లు
వాగ్గేయకారుడు
పుట్టపర్తి





అష్టాక్షరి పద ధారలు... మునిజన నియమాధారలు...

28, నవంబర్ 2013, గురువారం

ఆడుకోరా కృష్ణా ఆడుకో..


కృష్ణునిలా 
షష్టికములను చేసి 
లీలలు చేసి 
అమ్మకు విశ్వరూపం చూపిన అవతారం 
ఎక్కడా లేదు 

అసలు ఈ పిల్లాడేనా 
ఇంత గొప్ప వాడనుకుంది యశోద
అటువంటి యశోద 
సకల విశ్వాన్ని చూసింది 
చిన్ని కృష్ణుని నోటిలో..

మన్ను తిన్నావా ..
ఏదీ నోరు చూపు..

అమ్మ మన్ను తినంగనే నాకొంటినో 
శిశువునో వెర్రినో 

నిజంగా నోరు విప్పితే..
సమస్త భువన భాండమంతా గోచరమయ్యింది..
అంత గొప్ప ఆనందాన్ని అనుభవించింది ఆమె
మరుక్షణం విష్ణు మాయ కమ్మేసింది.

వీడా బ్రహ్మం అనుకుంది
ఎంత సౌలభ్యమండీ కృష్ణావతారంలో
ఎంత భక్త సులభుడై నిలిచాడా పరబ్రహ్మ..

ఆ మధుర మంగళ మనోహర రూపాన్ని 
పుట్టపర్తి వారు ఎంత అందంగా వర్ణించారో చూడండి..

ఆడుకోరా కృష్ణా..
ఆడుకో..
కాలమను సూత్రాన గట్టి బ్రహ్మాండమ్ము
మేలైన రతనాల మేటి గిలకల బండి
ఆడుకోరా కృష్ణా..
ఆడుకో..
వాడ వాడల తిరుగ వద్దురా నా తండ్రి..
ఆడుకోరా కృష్ణా ఆడుకో..
మనుజ తనువుల బోలు మట్టి గురిగెలయందు
మాటికిని చైతన్య మట్టి పాలను నింపి..
ఆడుకోరా కృష్ణా..
ఆడుకో..

మాయ బోలిన యమున మధురముగ ప్రవహింప..
ఆ యమున నీడలో అల్లనల్లజూచి..
ఆడుకోరా కృష్ణా..
ఆడుకో..



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి