మా అయ్యగారు శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారు కవి..పండితుడు..<విమర్శకుడు..గ్రంధకర్త..సంగీత సాహిత్య నాట్యశాస్త్రాల పారమెరిగినవారు..అంతేకాదు..గొప్పవాగ్గేయకారులు..అధ్భుతమైన కృతికర్త..నిజమైన భక్తిని అనుభవించి..ఆ అనుభవసారాన్నిమంచి మంచి కీర్తనలరూపంలోమనకూ అందజేసిన పరమ భక్తుడువారి కృతులుకడప హైదరాబాదు విజయవాడ విశాఖ పట్నంఆకాశవాణి కేంద్రాలలోగత నాలుగు దశాబ్దాలుగా అలరించాయి..ఆనాళ్ళలో..మంచి సాహిత్యంమంచి సంగీతంమంచి శ్రోతలుమంచి కాలంఅలా అన్నీ అమిరాయిఅమృతాన్ని పంచేఆప్రాభవాన్ని మళ్ళీ అక్షరరూపం లోఅందరికీ అందించాలనీఅనుభూతితో పాడే కంఠాల్లోవాని జీవత్వాన్ని మీరూ అనుభవించాలనీఓ చిన్ని ప్రయత్నం..అదే..సరస్వతీపుత్రుని అష్టాక్షరీ పద వైభవం గామీ ముందుకు తెస్తున్నాను..ఇందులోమా అమ్మా అయ్యా ఇద్దరూ వ్రాసినా..అమ్మ అయ్య వెనుకే వుండటానికి ప్రాధాన్యమిచ్చారు.కనుక ఆ తల్లిఆ సరస్వతీపుత్రునిలో సగ భాగంఎన్నడూ విడదీయలేనిదైంది..-పుట్టపర్తి అనూరాధ.
ఈ అష్టా క్షరీ కృతులు సుమారేడువేల వరకున్నవి ఇవి వ్రాసినప్పటి నా మానసిక స్థితి ..అది ఒక గొప్ప అనుభూతి ..వీని రచన 1948-1951 సంతవ్సరముల మధ్య సాగినదని చెప్పవచ్చు ఇవి యెన్నడైనను వెలుగు జూచు నను భావము నాకానాడు లేదు ఆ దృష్టితో వానిని వ్రాయలేదు గూడ వీని రచన నా దృష్టిలో ఒక సాధనా విశేషముగ నడచినది ఈ నాటికొక రెండు నూర్లు కృతులు బయటికి వచ్చినవి తక్కిన వేమగునో తెలియదు ఇవి వెలుగు జూచు విషయములో చాల భాగము పరిశ్రమ మా చిరంజీవి కొండప్ప దన వచ్చును వాడీ కృతులను చాల చోటులలో పాఠము చెప్పి ప్రచారము చేసెను నేటికిని చేయుచునాడు వానికి భగవంతుడు ఆయురారోగ్యములను బ్రసాదించుగాక ముఖ్యముగ యీ ప్రయత్నమునకు దాతలు శ్రీ వల్లంకొండు ఆంజనేయులు గూడూరు శ్రీరాములు శెట్టిగారలు వారిని శ్రీనివాసుడు సంతతము చల్లని చూపుతో చూచుగాక ఈ ప్రయత్నమునకు దోడ్పడిన మరి కొందరున్నారు వారు తమ నామ ధేయమును ప్రకటించుటకంగీకరింపలేదు. నా శిష్యులును కొందరున్నారు.
ఇట్లు
వాగ్గేయకారుడు
పుట్టపర్తి





అష్టాక్షరి పద ధారలు... మునిజన నియమాధారలు...

18, అక్టోబర్ 2012, గురువారం

లక్ష్మీ నృసిం హ లాలీ




ఇందుగలడందులేడని 

సందేహము వలదు
చక్రి సర్వోపహతుండు
ఎందెందు వెదకి చూచిన
 అందందేగలడు దానవాగ్రణి వింటే

అన్నాడు ప్రహ్లాదుడు

నరసింహా వతారమై 
వుగ్రరూపమై
స్థంభంలోంచీ 
పరమాత్మ ప్రకటమయ్యాడు.

ఓరుగల్లు సామ్రాజ్జాధిపతి

ప్రతాప రుద్రుడు శివభక్తుడు
ప్రతిరోజూ ఒక కొత్త బంగారు శివలింగంతో 
అభిషేకం చేసేవాడు
అది తరువాత బ్రాహ్మణునికి దానం చేసేవాడు

అహోబిల క్షేత్రం మీద వెళుతుండగా తెల్లవారింది

కంసలిని  పిలిచి
త్వరగా ఒక శివలింగం చేసి పట్టుకురమ్మన్నాడు

ఎంతసేపైనా రాడా కంసలివాడు

ఏం జరుగుతుందో తెలియట్లేదు ప్రభూ
ఎంత ప్రయత్నించినా బంగారు పోత పోస్తే 
అది శివలింగం కాకుండా 
నరసిం హ స్వామిగా మారిపోతోంది..
అన్నాడు వణికిపోతూ..

చేసేది లేక 

నరసిం హ స్వామికే అభిషేకం చేసి ధ్యానం చేసాడు 
అపుడు నరసిం హ స్వామి దర్శనమైంది..

ఇదంతా నా క్షేత్రం

 ఇక్కడ నేనే వుంటాను 
నేను వేరు శివుడు వేరు కాదు..
అన్నాడు




అటువంటి వాడు నరసింహు డు..
ఆ నరసింహు నిపై పుట్టపర్తి కనకమ్మ గారికి 
అంటే మా అమ్మకు ఎనలేని ప్రేమ
అంతటి వాడినీ పసివాణ్ణి చేసి జోలపాడిందా తల్లి..



తొలి సంతానం పై తల్లి కి ఎంతప్రేమో
మా పెద్దక్కయ్యకు పెండ్లి చేసినప్పుడు.
ఆమె అత్తగారింటి ఇంటిదేవుడు
లక్ష్మీ నరసిం హ స్వామి..
అందుకే అక్కయ్యకోసం 
మురిపెంగా అమ్మ ఈ పాటను వ్రాసింది..



రచన : శ్రీమాన్ పుట్టపర్తి నారాయణా చార్యులు 
గానం : ధర్మరాజు వంశీ ప్రియ 


లక్ష్మీనృసింహ  లాలీ భక్తులను 
లాలించు తండ్రి లాలీ
సూక్ష్మావతార లాలీ చోళంగి
శ్రీనికేతనుడ లాలీ

పట్టుపర్యంకమందు శ్రీదేవి

పట్టుపునుగులు చిలుకగా
అమృతవల్లిని గూడుచూ నరసిమ్హ
అలత దీరగ నుండుమా

అలసివచ్చినవాడవూనరసింహ 

అలపెల్ల దీరగానూ
అలన శ్రె సతి హాసమే పూవులై
అలరారు గళమునందు

ఇరవుగా భూతలమునా నిలువగా

సరసమౌ వసతిలేక
గరుడాద్రి శిఖరి నుండి ఆశ్రితుల
గమనించి బ్రోతువయ్యా

వేదములె కోళ్ళుగానూ మంచమున

నాదిశలె పట్టెలుగను
శ్రీదేవి పానుపుగను భువనంపు
బాధలే మరువవయ్యా..

భక్తులర్పించు పాలు పండ్లును

రక్తితో గ్రహియించుచూ
లోకంపు జాడలరసి ఏకాంత
చిత్తమున దలపోయుమా

వేగిలేచినది మొదలు వేదనల

క్రాగి నవసెడి భక్తులా
బాధలను రూపుమాపి నీవెంతొ
బడలినావయ్య దేవా

తిన్నగా నవ్వెనేమో పెదవిపై

వెన్నెలలె వెల్లిగొనెను
కన్నతండ్రికి నిదురలో మనసులో
ఎన్నెన్ని ఊహలమ్మా

అలివేణులార మీరు కరములను

ఆలవట్టముల బూని
అలసిన నరసిం హు ని  విసరరే
అలక దీరంగ నిపుడూ

సరసంపు మాటలాడి నరహరి

సిరిగూడి నిదురింపగా
అరమోడ్పు కన్నుగవను చూడుడీ
దరహాస మిగురించెను

అభిలార్తి హర నృసింహ

అమృత శ్రీ నారసింహ 
గరుడాద్రి నారసింహ నిదురింప 
కమలాక్ష శ్రీ  నృసింహ

పరమ తారకమైన యీ నరసింహ 

భక్తి గీతము బాడుచూ
నరహరిని కీర్తింపగా వారికా
నృహరి సాయుజ్యయుక్తి..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి