మా అయ్యగారు శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారు కవి..పండితుడు..<విమర్శకుడు..గ్రంధకర్త..సంగీత సాహిత్య నాట్యశాస్త్రాల పారమెరిగినవారు..అంతేకాదు..గొప్పవాగ్గేయకారులు..అధ్భుతమైన కృతికర్త..నిజమైన భక్తిని అనుభవించి..ఆ అనుభవసారాన్నిమంచి మంచి కీర్తనలరూపంలోమనకూ అందజేసిన పరమ భక్తుడువారి కృతులుకడప హైదరాబాదు విజయవాడ విశాఖ పట్నంఆకాశవాణి కేంద్రాలలోగత నాలుగు దశాబ్దాలుగా అలరించాయి..ఆనాళ్ళలో..మంచి సాహిత్యంమంచి సంగీతంమంచి శ్రోతలుమంచి కాలంఅలా అన్నీ అమిరాయిఅమృతాన్ని పంచేఆప్రాభవాన్ని మళ్ళీ అక్షరరూపం లోఅందరికీ అందించాలనీఅనుభూతితో పాడే కంఠాల్లోవాని జీవత్వాన్ని మీరూ అనుభవించాలనీఓ చిన్ని ప్రయత్నం..అదే..సరస్వతీపుత్రుని అష్టాక్షరీ పద వైభవం గామీ ముందుకు తెస్తున్నాను..ఇందులోమా అమ్మా అయ్యా ఇద్దరూ వ్రాసినా..అమ్మ అయ్య వెనుకే వుండటానికి ప్రాధాన్యమిచ్చారు.కనుక ఆ తల్లిఆ సరస్వతీపుత్రునిలో సగ భాగంఎన్నడూ విడదీయలేనిదైంది..-పుట్టపర్తి అనూరాధ.
ఈ అష్టా క్షరీ కృతులు సుమారేడువేల వరకున్నవి ఇవి వ్రాసినప్పటి నా మానసిక స్థితి ..అది ఒక గొప్ప అనుభూతి ..వీని రచన 1948-1951 సంతవ్సరముల మధ్య సాగినదని చెప్పవచ్చు ఇవి యెన్నడైనను వెలుగు జూచు నను భావము నాకానాడు లేదు ఆ దృష్టితో వానిని వ్రాయలేదు గూడ వీని రచన నా దృష్టిలో ఒక సాధనా విశేషముగ నడచినది ఈ నాటికొక రెండు నూర్లు కృతులు బయటికి వచ్చినవి తక్కిన వేమగునో తెలియదు ఇవి వెలుగు జూచు విషయములో చాల భాగము పరిశ్రమ మా చిరంజీవి కొండప్ప దన వచ్చును వాడీ కృతులను చాల చోటులలో పాఠము చెప్పి ప్రచారము చేసెను నేటికిని చేయుచునాడు వానికి భగవంతుడు ఆయురారోగ్యములను బ్రసాదించుగాక ముఖ్యముగ యీ ప్రయత్నమునకు దాతలు శ్రీ వల్లంకొండు ఆంజనేయులు గూడూరు శ్రీరాములు శెట్టిగారలు వారిని శ్రీనివాసుడు సంతతము చల్లని చూపుతో చూచుగాక ఈ ప్రయత్నమునకు దోడ్పడిన మరి కొందరున్నారు వారు తమ నామ ధేయమును ప్రకటించుటకంగీకరింపలేదు. నా శిష్యులును కొందరున్నారు.
ఇట్లు
వాగ్గేయకారుడు
పుట్టపర్తి





అష్టాక్షరి పద ధారలు... మునిజన నియమాధారలు...

24, అక్టోబర్ 2012, బుధవారం

ఎంతని కీర్తింతునురా..






అజ్ఞాత వాగ్గేయకారులు పేరిట
 TTD చానల్ లో ఒక ప్రోగ్రాం వచ్చింది..
అందులో 
మా అక్కయ్య 
పుట్టపర్తి నాగపద్మినిని ఆహ్వానించారు

అక్కయ్య మా నాన్న గారి గురించి చక్కగా చెప్పింది

పుట్టపర్తి వారు అష్టాక్షరి మకుటంగా 
సుమారు ఏడు వేల కీర్తనలు వ్రాసారు

అవి కేవలం భక్తిలో తాదాత్మ్యత పొంది 

తనకోసం తానుగా వ్రాసుకున్నవి
తనలోని ప్రతి భావాన్నీ
కోపం 
ప్రేమ
విరహం
తపన
అలక
ఇలా ..

ఆ పరమాత్మతో వ్యక్త పరచుకున్న 

భావ పరంపరలే ఆ కీర్తనలు
అందులో తాను చేసిన తప్పులను 
చేసిన దోషాలను
దాపరికం లేకుండా 
చెప్పుకున్నవే ..

అంతే గాక

సంగీతంలో మంచి ప్రవేశం 
అభిరుచి ప్రేమ వున్న కారణంగా
పుట్టపర్తి వారు ప్రొద్దుటూరులో వున్న రోజులలో

 మైసూరు చౌడప్ప శిష్యులు 

జమాలప్పగారితో కలిసి 
రక రకాల రాగాలలో కృతులు వ్రాయటం 
వానికి సంగీతం నోట్లు వ్రాయటం జరిగింది
జమాలప్ప గారు మంచి వయొలిన్ ఆర్టిస్ట్

అపురూపమైన రాగాలు

 హేజ్జుజ్జి 
ముఖారి 
లతాంగి 
కల్యాణ కేసరి
పుష్పలతిక 
సైంధవి
తరంగిణి
కైకవసి 
ఝంకార ధ్వని 
త్యాగయ్య గారు చాలా వ్రాసారట
ఆ రాగాలలో పుట్టపర్తి వారూ ఎన్నో కృతులు రచించారు 






శుభ పం తు వరాళి - రూపక తాళం 


ఎంతని కీర్తింతునురా ..

యేమో నీ కరుణ  గలుగ..

పంతమేల..? గిరిధర నా పై ..

నీ వాడగాన..

సవసవగా పెద్దలచే చరితంబులు విని నమ్మితి..

భువనావన.. యెపుడో యేమో నీరాక..!!

కనులకు వెన్నేల వడుపున కళలనీను చిరునగవై..

మనసివైరారా ..!శ్యామా ..యిదిగాదు మేర..!!

యమునా తటములయందో.. ఆ రాధామణితోనో..

యేమో నీ పొలకువలూ.. స్వామీఇక వెదుకలేను..

ప్రాణము.. మానము.. మరియభిమానము నీవైపోయీ..

దీనుడనై ..నీ కొరకై.. దినదినమును యెదురుచూచి..

ఆసలు అడియాసలుగా ఆవాసము దుఃఖముగా

యీశా యిక బ్రదుకను..! రావేమీ యష్టాక్షరినిధి..?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి